Karthika Masam: కార్తీక మొదటి సోమవారం.. భక్తులు ప్రత్యేక పూజలు..
ABN, Publish Date - Oct 27 , 2025 | 05:22 PM
కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గణేశ్ ఆలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్లోని సంగమేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
1/5
కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
2/5
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గణేశ్ ఆలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3/5
అలాగే సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్లోని సంగమేశ్వరాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
4/5
అలాగే స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించారు.
5/5
దీంతో దేవాలయాలు.. ముఖ్యంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్టోబర్ 21వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం అయింది. దీంతో ఈ రోజు తొలి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
Updated at - Oct 27 , 2025 | 05:46 PM