Jupiter Transit: గురు గ్రహం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి పండగే..
ABN, Publish Date - Oct 08 , 2025 | 04:36 PM
ఈ దీపావళికి ఓ ప్రాముఖ్యతను సంతరించుకుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే సంచారం చేసే.. గురు గ్రహం ఈ సంవత్సరంలో మూడు సార్లు సంచారం చేయనుంది. దీని ప్రభావం దీపావళి ముందు అధికంగా ఉండే అవకశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీని వలన పలు రాశుల వారికి లాభం చేకూరుగా.. కొందరికి కష్టాలు రానున్నాయి. గ్రహం ప్రభావంతో కొందరు జీవితాల్లో అద్భుతాలు జరిగి.. కోటీశ్వరులు కాబోతున్నారు. ఇంతకి లబ్ధి చేకూరే ఆ రాశులు ఏవీ..? ఆ రాశులపై గ్రహం ప్రభావం ఏలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
1/4
మిథున రాశి: మిథున రాశి గల వారి కుటుంబంలోని సమస్యలు తొలిగిపోతాయి. అలాగే.. ఆర్థిక లావాదేవీల్లో అద్భుత ప్రగతి సాధిస్తారు. విలువైన బంగారం, వెండి కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తోంది. వైద్య, కళా రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.
2/4
మీన రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. గురు గ్రహం ప్రభావం వలన మీన రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది.
3/4
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి సంతోషంగా ఉంటారు. విద్యార్థులు విదేశీ ప్రయాణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దీపావళి పండుగకు ముందు నుంచే వీరి జీవితం ఆనందంగా ఉంటుంది.
4/4
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. రాశి గల విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. అలాగే.. ఆదాయం పెరుగుతుంది. అనుకని విధంగా డబ్బు చేతికందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది.
Updated at - Oct 08 , 2025 | 04:38 PM