Vasant Panchami: కరీంనగర్లో మహాశక్తి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
ABN, Publish Date - Feb 03 , 2025 | 11:06 AM
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా పోటెత్తిన భక్తులు సామూహిక అక్షరాభ్యాసాలు జరిపిస్తున్నారు. ఈ వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1/6
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
2/6
ఈ సందర్భంగా ప్రాతఃకాల సమయంలోనే అమ్మవారికి అభిషేకం చేశారు. ఏకవార రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, పంచసూక్తాభిషేకాలను శాస్ర్తోకంగా చేపట్టారు.
3/6
అనంతరం సహస్రనామ కుంకుమార్చనలు, పుష్పార్చనలు, మహామంత్రపుష్పం, మహా నైవేద్యం, మహామంగళహారతులు వంటి తదితర పూజా కైంకర్యాలను జరిపారు.
4/6
ఆలయ ముఖ మండపంలో పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ సామూహిక అక్షరాభ్యాసాలు, బీజాక్షర క్రతువులను నిర్వహించారు.
5/6
పూజల్లో స్థానిక భక్తులు భారీగా పాల్గొన్నారు. సరస్వతి దేవి అమ్మవారికి విశేష పూజాదికాలు నిర్వహించారు.
6/6
ఆలయంలో సరస్వతి దేవి ఆవాహన పూజ, హోమం చేపట్టారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Updated at - Feb 03 , 2025 | 11:12 AM