Nagoba Jatara 2025 : నాగోబా జాతరకు వేళాయే... దారులన్నీ కేస్లాపూర్ వైపే..
ABN, Publish Date - Jan 28 , 2025 | 10:15 PM
ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహాజాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభమైంది.
1/14
ఈ జాతరలో మేస్త్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు.
2/14
ఈ జాతరలో రాత్రి 12 గంటలకు గోదావరి నది జలాలతో అభిషేకం చేశారు. కొత్త కుండల్లో నీళ్లు తెచ్చి పుట్టని చేసి పూజ ప్రారంభించడంతో ఈ జాతర ఘనంగా ప్రారంభమైంది.
3/14
జనవరి 30వ తేదీన ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది.
4/14
31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. ఫిబ్రవరి1వ తేదీన భేతల్ పూజలు, మండ గాజిలి పూజలు చేయడంతో నాగోబా జాతర అధికారికంగా ముగుస్తుంది. జాతరకు వచ్చే భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
5/14
ఈ జాతరకు భక్తులు బారీగా తరలివస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేస్తుంది.
6/14
మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా జాతరకు తరలి వస్తున్నారు.
7/14
మెస్రం వంశీయులు తాము బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
8/14
మెస్రం వంశ పెద్దలు కొత్త కుండలను ఇవ్వగా.. మహిళలు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వంశ అల్లుళ్లు, ఆడపడుచులు వరుసగా వెళ్లి వడమర సమీపంలోని కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
9/14
కొత్తకుండల్లో పవిత్ర జలం సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం పక్కనే గల పాత మట్టి పుట్టలను అల్లుళ్లు తవ్వగా... ఆ మట్టితో మహిళలు తిరిగి కొత్తపుట్టను తయారుచేశారు.
10/14
తయారు చేసిన పుట్టల నుంచి మట్టిని ఉండల రూపంలో తీసుకుని ఏడు వరుసలతో బౌల దేవతను తయారు చేసి మొక్కుకున్నారు.
11/14
అనంతరం ఏడు వరుసలతో తయారు చేసిన మట్టి ఉండలతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో సతిదేవతలను తయారుచేసి సంప్రదాయ పూజలు చేశారు.
12/14
పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని రాత్రి 9 గంటల నుంచి 12గంటల వరకు గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాకు జలాభిషేకం చేసి మహాపూజ నిర్వహించారు.
13/14
అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మెస్రం వంశీయులతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
14/14
అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు బేటింగ్ (పరిచయం) పూజలకు ఏర్పాటు చేశారు. బేటింగ్తో వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు.
Updated at - Jan 28 , 2025 | 10:34 PM