YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల

ABN, Publish Date - Oct 08 , 2025 | 08:21 AM

విశాఖపట్నం కంచరపాలెం కప్పరాడ 47వ వార్డులో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమంలో భాగంగా భారీ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 1/9

ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ (ఓట్ల దొంగ-గద్దె దిగండి) నినాదంతో ఏపీ కాంగ్రెస్‌ మంగళవారం సాయంత్రం విశాఖపట్నం నగరంలో కార్యక్రమం నిర్వహించింది.

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 2/9

ఉత్తర నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ క్యాంపెయిన్‌లో పీసీసీ అధ్యక్షురాలు వై ఎస్. షర్మిల పాల్గొన్నారు.

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 3/9

స్థానిక ప్రజలతో ఆమె మమేకమై సంతకాలు సేకరించారు. ఓట్ల చోరీ వ్యవహారంపై రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించారు షర్మిల.

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 4/9

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు షర్మిల.

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 5/9

దేశంలో ఓట్ల చోరీ జరిగిందని విమర్శించారు షర్మిల.

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 6/9

దొంగ ఓట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గెలిచారని ఆరోపించారు షర్మిల.

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 7/9

కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి సంతకాలు చేస్తున్నారనిపేర్కొన్నారు షర్మిల.

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 8/9

ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమంలో సంతకాలు చేస్తున్న ప్రజలు

YS Sharmila: విశాఖపట్నంలో ఓట్‌ చోర్‌ - గద్దీ చోడ్‌ కార్యక్రమం.. పాల్గొన్న షర్మిల 9/9

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు అడ్డాల వర్మరాజు, ఉత్తరాంద్ర ఇన్‌చార్జి లక్కరాజు రామారావు, నాయకులు ప్రియాంక దండి, తదితరులు పాల్గొన్నారు.

Updated at - Oct 08 , 2025 | 08:23 AM