విజయవాడ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించిన వైఎస్ . జగన్ మోహన్ రెడ్డి
ABN, Publish Date - Feb 18 , 2025 | 05:24 PM
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలు వద్దకు చేరుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ ములాఖత్ అయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడ జైలు వద్దకు వెళ్లారు

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్ష్యులను బెదిరించారన్న కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ అయ్యారు.

ములాఖత్ అనంతరం మీడియాతో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.

రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని జగన్ జైలులో పరామర్శించారు.

జగన్తో పాటు వంశీని కలిసిన వారిలో తలశిల రఘురాం, వంశీ సతీమణి పంకజశ్రీ ఉన్నారు.

వంశీని పరామర్శించేందుకు జగన్ జిల్లా జైలుకు వచ్చిన నేపథ్యంలో ఆ మార్గంలో ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

వైసీపీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకునుని మరీ జైలు గేటు వద్దకు చేరుకున్నారు.దీంతో ఉద్రిక్తత నెలకొంది
Updated at - Feb 18 , 2025 | 05:24 PM