Thalassemia Run: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా రన్
ABN, Publish Date - Jul 20 , 2025 | 10:20 AM
విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్రోడ్డులో శనివారం సాయంత్రం ఆరు గంటలకు తలసేమియా రన్ నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియాపై అవగాహన కోసం ఈ రన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె జెండా ఊపి 10కే, 5కే, 3కే రన్ను ప్రారంభించారు. అనంతరం విజేతలకు భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో రాజేంద్రకుమార్, మాజీ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం భువనేశ్వరి ప్రసంగించారు.
1/14
విశాఖపట్నంలోని రామకృష్ణా బీచ్రోడ్డులో శనివారం సాయంత్రం ఆరు గంటలకు తలసేమియా రన్ నిర్వహించారు.
2/14
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియాపై అవగాహన కోసం ఈ రన్ ఏర్పాటు చేశారు.
3/14
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
4/14
భువనేశ్వరి జెండా ఊపి 10కే, 5కే, 3కే రన్ను ప్రారంభించారు.
5/14
అనంతరం విజేతలకు భువనేశ్వరి బహుమతులు అందజేశారు.
6/14
ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో రాజేంద్రకుమార్, మాజీ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నారా భువనేశ్వరి ప్రసంగించారు.
7/14
తలసేమియా పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధి అని నారా భువనేశ్వరి తెలిపారు.
8/14
ఈ వ్యాధితో బాధపడే పిల్లలకు ప్రతి 21 రోజులకు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని నారా భువనేశ్వరి చెప్పుకొచ్చారు.
9/14
ఎక్కువ మంది రక్తదానం చేస్తే ఆయా పిల్లలకు సాంత్వన లభిస్తుందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
10/14
ఈ వ్యాధిపై అందరిలో అవగాహన కల్పించేందుకు ఈ రన్ నిర్వహిస్తున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.
11/14
ఈ రన్లో పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
12/14
ఈ రన్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
13/14
ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుకు చిన్నారులతో వచ్చిన కొందరు తల్లులు.. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించగలరా? అని తనను అడగడంతో.. వారి కోసం ఏదైనా చేయాలనే నిర్ణయంతో తలసేమియా రన్ నిర్వహిస్తున్నట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
14/14
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయించడంతోపాటు ఫిల్టర్స్, రూ. 6 వేల విలువజేసే మందులు అందిస్తున్నామని నారా భువనేశ్వరి వెల్లడించారు.
Updated at - Jul 20 , 2025 | 10:27 AM