Basavatarakam Indo American Cancer Hospital: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన
ABN, Publish Date - Aug 13 , 2025 | 09:52 PM
రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దంపతులు శంకుస్థాపన చేశారు. తుళ్లూరులో ఈ7 రహదారిని ఆనుకుని ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. 2019లోనే ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. కానీ గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు.
1/3
పేదవారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించడం తన కన్నతల్లి కోరిక అని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆమె కోరికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిగా సేవలందిస్తోందని చెప్పారు. లాభాపేక్ష లేని ఈ ఆసుపత్రి.. దాతల సహకారంతో నడుస్తుందన్నారు. బుధవారం (2025, ఆగస్టు 13) తుళ్లూరులో ఈ7 రహదారిని ఆనుకుని ఆసుపత్రి నిర్మాణానికి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దంపతులు శంకుస్థాపన చేశారు.
2/3
అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అంధకార పరిస్థితులు ఏర్పాడ్డాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేక పోయామన్నారు.
3/3
ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పనులు చేపట్టామన్నారు. వర్షం రూపంలో భగవంతుడు సైతం ఆశీస్సులు అందించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో మొత్తం 21 ఎకరాల్లో 500 బెడ్ల సామర్థ్యంతో రూ. 750 కోట్లతో ఈ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ను నిర్మిస్తున్నారు.
Updated at - Aug 13 , 2025 | 09:52 PM