Naga Babu: అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: నాగబాబు
ABN, Publish Date - Feb 03 , 2025 | 06:52 AM
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ‘ జనం లోకి జనసేన‘ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో జనసేన అగ్రనేత నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
1/6
నాగబాబుకు జనసేన నేతలు అపూర్వ స్వాగతం పలికారు.
2/6
ఈ సభకు జనసేన నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
3/6
ఈ సభలో వైసీపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు.అవినీతి నేతలను జైలుకు పంపిస్తామని నాగబాబు తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు వైసీపీలో ఎవరూ ఉండరని నాగబాబు విమర్శించారు.
4/6
పెద్దిరెడ్డి రూ.2 లక్షల కోట్ల అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు.
5/6
అసెంబ్లీకి రాని పెద్దిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో చెరువులు ఆక్రమించారని ఆరోపించారు. అడవి దొంగ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని నాగబాబు విమర్శించారు.
6/6
ఈ సభలో జనసేన ముఖ్య నేతలు వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Updated at - Feb 03 , 2025 | 06:53 AM