నాగాలమ్మ గుడిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు..
ABN, Publish Date - Jan 15 , 2025 | 11:31 AM
తిరుపతి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు చంద్రగిరి మండలం, నారావారి పల్లె గ్రామం, నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగా నేపథ్యంలో మంగళవారం ఉదయం నారా వంశీకులు నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మిని, దేవాన్ష్, ఎంపీ భరత్ ఆయన సతీమణి తేజస్విని, తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి నాగాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగాలమ్మ పుట్ట చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న చంద్రబాబు, కుటుంబసభ్యులు..

నాగాలమ్మకు పూజలు నిర్వహించి హారతులు ఇస్తున్న మహిళలు..

హరతి కళ్లకు అద్దుకుంటున్న చంద్రబాబు మనవడు దేవాన్ష్..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి నాగాలమ్మ ఆలయానికి వస్తున్న దృశ్యం..

దివంగత ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలదండలేసి నివాళులర్పించిన చంద్రబాబు, లోకేష్..

మనవళ్లతో సరదాగా ముచ్చటిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి..

తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు - అమ్మనమ్మ సమాధులు వద్ద పుష్పములుంచి చంద్రబాబు కుటుంబ సభ్యుల నివాళి..

ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు..
Updated at - Jan 15 , 2025 | 11:31 AM