బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
ABN, Publish Date - Feb 10 , 2025 | 03:48 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు

ఏపీ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయానికి బ్యాంకర్లతో ఇవాళ సమావేశం అయ్యారు.

2024, అక్టోబర్ 17న జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో అధికారులు ఇచ్చిన రిపోర్టుపై చంద్రబాబు ఇవాళ్టి భేటీలో చర్చించనున్నారు.

వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 డివిజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, పీ4 విధానం అంశాలపై ఎస్ఎల్బీసీ అధికారులతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారంపై భేటీలో డిస్కస్ చేయనున్నారు.

టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి లాంటి కేంద్ర పథకాలపైనా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణ, జిల్లాలకు సంబంధించిన డిజిటల్ అంశం పైనా సీఎం డిస్కస్ చేయనున్నారు.

ఈ సమావేశానికి సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు కూడా హాజరు కానున్నారు.
Updated at - Feb 10 , 2025 | 03:49 PM