ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహణలో జరిగిన అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం
ABN, Publish Date - Jan 28 , 2025 | 09:35 PM
ప్రజల స్థానిక సమస్యలను అధికార యంత్రాంగానికి నివేదించి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లే పరిష్కార వారధిగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా' కార్యక్రమం నేడు ప్రారంభం అయింది
1/9
చిత్తూరు జిల్లాలోని సంతపేటలో కార్యక్రమం జరిగింది . విజయలక్ష్మి కాలనీ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదిక అయింది
2/9
సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, నీటి పాల సమస్యలు వంటివి ఈ సదస్సుకు హాజరయ్యిన కార్పొరే షన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది
3/9
ఈ సదస్సుకు మేయర్ అముడ, కమిషనర్ నరసింహ ప్రసాద్ తో పాటు పలు శాఖం మున్సిపల్ అధికారులు హాజరు అయ్యారు
4/9
కర్నూల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా కార్యక్రమ దృశ్యాలు
5/9
హాజరైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు
6/9
తమ సమస్యలను విన్నవించుకున్న ప్రజలు.పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన జిల్లా అధికారులు
7/9
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది
8/9
విశాఖపట్నం వడ్లపూడి తిరుమల నగర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమం
9/9
రోడ్లపై గుంతల నుంచి కుళాయిల్లో రాని నీళ్ల దాకా సమస్యలను ప్రజాప్రతినిధుల ముందు విన్నవించుకున్న ప్రజలు
Updated at - Jan 28 , 2025 | 09:35 PM