Women Officers: కశ్మీరీ పండిట్.. ముస్లిం సైన్యాధికారిణి..
ABN , Publish Date - May 08 , 2025 | 03:47 AM
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసి సమర్థవంతంగా దాడి నిర్వహించడంతో పాటు, మతాతీత భావాన్ని ప్రపంచానికి చాటింది. ఈ ఆపరేషన్ వివరాలను మహిళా సైనికాధికారుల ద్వారానే వెల్లడించటం గమనార్హంగా నిలిచింది.
‘ఆపరేషన్ సిందూర్’ దాడితోనే కాదు.. ఆ వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్థాన్కు, ప్రపంచానికి భారత్ బలమైన సంకేతాలు పంపింది. ఇద్దరు మహిళా సైనికాధికారులు, ఓ కశ్మీరీ పండిట్ (విదేశాంగ కార్యదర్శి మిస్రీ) ద్వారా ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఈ ఇద్దరు సైనికాధికారుల్లో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ కావడం గమనార్హం. సోఫియా తాత, తండ్రి సైన్యంలో పనిచేయగా, ఆమె భర్త కూడా సైన్యంలోనే ఉన్నారు. మరో అధికారిణి వాయుసేన వింగ్ కమాండర్, పైలట్ వ్యోమికా సింగ్. ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్గా పనిచేస్తున్నారు. మతం అడిగిమరీ అమాయక పౌరులను చంపి ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ వివరాలను మహిళా సైనికాధికారుల ద్వారా మతాతీతంగా భారత్ వెల్లడించడం గొప్ప విశేషం.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News