Share News

UK PM Keir Starmer: భారత్‌కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్

ABN , Publish Date - Oct 08 , 2025 | 02:51 PM

బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌‌కు ముంబైలో ఘన స్వాగతం దక్కింది. ముంబైలో వ్యాపార వేత్తలతో కీర్ సమావేశమయ్యారు. రేపు ప్రధానితో భేటీ ఉంటుంది. తన పర్యటన గురించి, కీర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

UK PM Keir Starmer: భారత్‌కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్
Keir Starmer India visit 2025

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇవాళ భారతదేశానికి వచ్చారు. ఇది భారత దేశంలో ఆయన మొదటి అధికారిక పర్యటన. ఈ ఉదయం (అక్టోబర్ 8)న ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కీర్ బృందం దిగింది. వారిని మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ సాదరంగా ఆహ్వానించారు.

యూకే నుంచి 125 మంది సభ్యులతో గరిష్ట స్థాయి వాణిజ్య డెలిగేషన్‌తో వచ్చిన స్టార్మర్, అనంతరం ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. తాజ్‌మహల్ ప్యాలెస్‌లో వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిస్పోజబుల్ కెమెరాతో సెల్ఫీ తీసుకున్న ఆయన ఆటోగ్రాఫ్ మూమెంట్ వైరల్ అయింది.


యూకే ప్రధాని కీర్ స్టార్మర్, భారత పర్యటన గురించి మన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. 'భారత్‌కు మొదటి చారిత్రక సందర్శనకు వచ్చిన యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌ను స్వాగతిస్తున్నా.. యూకే నుంచి వచ్చిన అతి పెద్ద వాణిజ్య డెలిగేషన్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నా.. రేపటి మా సమావేశంలో.. ఇరుదేశాలు బలమైన, పరస్పర లాభదాయక భవిష్యత్తు సాధించే దిశగా ముందుకు వెళ్లడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నాను' అని మోదీ పేర్కొన్నారు.


ఇలా ఉండగా, బ్రిటన్ ప్రధాని భారత పర్యటన భారత్-యూకే భాగస్వామ్యానికి కొత్త అధ్యాయాన్ని రాస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది. రేపు, అక్టోబర్ 9, 2025న ముంబైలో పీఎం మోదీ, స్టార్మర్ మధ్య చర్చలు జరగనున్నాయని తెలిపింది.

'విజన్ 2035' రోడ్‌మ్యాప్ ప్రకారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, భద్రత, వాతావరణం, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాల్లో పురోగతిని సాధించడమే లక్ష్యంగా ఇరు దేశాలు సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. భారత్-యూకే కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (CETA) ఇందులో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది.


ఇలా ఉండగా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన భారత పర్యటన గురించి, చాలా ఆసక్తికర సందేశాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'నేను ముంబైలో బ్రిటిష్ వ్యాపారానికి నాంది పలుకుతున్నాను. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ వ్యాపారాలు వృద్ధి చెందితే, స్వదేశంలో(బ్రిటన్) ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయి.' అని ఆయన పేర్కొన్నారు. దీనిబట్టి భారత పర్యటనకు బ్రిటన్ ప్రభుత్వం ఎంతటి ప్రాముఖ్యతనిస్తుందో అర్థం చేసుకోవచ్చు.


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2025 | 03:01 PM