Social Media Arrests: పాక్ మద్దతుగా సోషల్ మీడియా పోస్టులు
ABN , Publish Date - May 10 , 2025 | 05:12 AM
సోషల్మీడియాలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ పోస్టులు చేసిన పుణె, భీవండిలోని ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలు దేశ భద్రతా పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలపై పరిమితుల అవసరంపై చర్చకు దారి తీశాయి.

పుణె, భీవండీలో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్
పుణె, మే 9: పాకిస్థాన్ మద్దతుగా సోషల్మీడియాలో పోస్టులు చేసిన ఇద్దరు విద్యార్థులను రెండు వేర్వేరు ఘటనల్లో శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ’పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు పోస్ట్ చేసిందన్న ఆరోపణలతో కొంధ్వా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా ఽథానే జిల్లాలోని భీవండిలో జరిగిన మరో ఘటనలో కూడా 18 ఏళ్ల యువకుడిని ఇవే ఆరోపణలతో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి