Share News

Terrorism: ఆ ఇద్దర్నీ అప్పగించండి

ABN , Publish Date - May 10 , 2025 | 04:18 AM

భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్‌ బాధ్యత వహించాలన్నది, లేకపోతే పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. అలాగే, పాక్‌ నుంచి ఉగ్రవాద నేతలను అప్పగించాలని భారత్‌ డిమాండ్‌ చేసింది.

Terrorism: ఆ ఇద్దర్నీ అప్పగించండి

మసూద్‌ అజర్‌, హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత్‌ డిమాండ్‌?

అధికార వర్గాలను ఉటంకిస్తూ న్యూస్‌18 కథనం

న్యూఢిల్లీ, మే 9: ఉద్రిక్తతలను వీలైనంత త్వరగా తగ్గించాల్సిన బాధ్యత పాక్‌ మీదే ఉందని, లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదనిని కేంద్రంలో అత్యున్నత స్థాయి అధికార వర్గాలు హెచ్చరించాయి. అంతేకాదు.. భారత్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు సయీద్‌ను తమకు అప్పగించాల్సిందిగా కూడా ఇస్లామాబాద్‌ను భారత్‌ డిమాండ్‌ చేసినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆ వర్గాలను ఉటంకిస్తూ న్యూస్‌18 వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ‘‘పాకిస్థాన్‌ ఈ సమస్యకు అసలు కారణంపై దృష్టి సారించాలి. వారి గడ్డపై ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలి’’ అని అధికార వర్గాలు పేర్కొన్నట్టు అందులో వెల్లడించింది. మసూద్‌ అజర్‌, హఫీజ్‌ సయీద్‌ను అప్పగిస్తే పాక్‌కు ఈ యుద్ధాన్ని తప్పించుకోవడానికి ఒక దారి దొరికినట్టవుతుందని.. అదే సమయంలో, పాకిస్థాన్‌ ఉగ్రవాదుల స్వర్గధామమన్న అపప్రధను తొలగించుకునే అవకాశం కూడా కలుగుతుందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 04:18 AM