RSS: పహల్గాం బాధితులకు న్యాయం
ABN , Publish Date - May 10 , 2025 | 05:20 AM
పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపడుతున్న చర్యలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రశంసించారు. దేశ భద్రత కోసం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఎదుర్కోవడం అవసరమని ఆయన అన్నారు.

కేంద్రం చేపడుతున్న చర్యలపై మోహన్ భాగవత్ హర్షం
న్యూఢిల్లీ, మే 9: ఆపరేషన్ సిందూర్పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం చేపడుతోన్న చర్యలను ఆర్ఎ్సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రశంసించారు. పహల్గాం బాధితులకు న్యాయం లభించినట్లైందని వ్యాఖ్యానించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పీచమణచడం దేశ భద్రతకు అవసరమని చెప్పారు. కర్ణాటక బెళగావిలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కీలక సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి అండగా నిలుస్తున్నారని చెప్పారు. సమాజంలో ఐక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని మోహన్ భాగవత్ సూచించారు. సైన్యానికి, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆయన దేశ పౌరులకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి