Share News

Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 15 మందికి గాయాలు..

ABN , Publish Date - Feb 02 , 2025 | 10:23 AM

ఓ హైవేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లగ్జరీ బస్సు ఆకస్మాత్తుగా 200 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. దీంతో ఏడుగురు ప్రయాణికులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి, 15 మందికి గాయాలు..
Accident in Maharashtra Nashik-Gujarat Highway

మహారాష్ట్ర(Maharashtra)లోని నాసిక్-గుజరాత్ హైవేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ లగ్జరీ బస్సు అనుకోకుండా 200 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణించిన వారిలో పలువురు మృతి చెందగా, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.


ప్రయాణికుల్లో ఎక్కువగా..

నాసిక్‌లోని సపుతర ఘాట్ ప్రాంతం నుంచి సూరత్ వైపు వెళ్ళే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఓ పహిడి మార్గంలో ప్రయాణించగానే ఆ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అనుకోకుండా నియంత్రణ కోల్పోయి 200 అడుగుల లోతు గుంతలో పడిపోయింది. ఈ ప్రమాద ప్రయాణికులలో ఎక్కువ మంది మధ్యప్రదేశ్‌కు చెందినవారుగా తెలుస్తోంది. వారు నాసిక్‌లోని తీర్థయాత్ర ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లారని సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


మరింత పెరిగే అవకాశం

సమాచారం ప్రకారం గాయపడిన ప్రయాణికులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా బస్సుకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో పాటు అనేక మంది ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో అధికారులు వేగంగా స్పందించారు. వారి యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.


ప్రమాదానికి కారణమిదేనా..

దీంతోపాటు డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందా లేదా మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశాడా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకునే అంశాలపై యత్నిస్తున్నారు. ప్రమాదాలు ఎలా నివారించవచ్చనే విషయాలను దృష్టిలో ఉంచుకుని అడ్వైజరీ చర్యలు చేపట్టేందుకు పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..


Waqf Amendment Bill: ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక


RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 02 , 2025 | 10:53 AM