Share News

Artificial Rainmaking Trial: రాజస్థాన్‌లో డ్రోన్లతో మేఘమథనం

ABN , Publish Date - Aug 13 , 2025 | 03:38 AM

దేశంలోనే తొలిసారిగా డ్రోన్లతో కృత్రిమ వర్షాలను సృష్టించే మేఘమథనం ప్రయత్నం రాజస్థాన్‌లో...

Artificial Rainmaking Trial: రాజస్థాన్‌లో డ్రోన్లతో మేఘమథనం

న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశంలోనే తొలిసారిగా డ్రోన్లతో కృత్రిమ వర్షాలను సృష్టించే మేఘమథనం ప్రయత్నం రాజస్థాన్‌లో మంగళవారం జరిగింది. జైపూర్‌ జిల్లాలో జామ్వారామ్‌గఢ్‌ జలాశయాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో దీనిని చేపట్టారు. రాజస్థాన్‌ వ్యవసాయశాఖ, అమెరికా-బెంగళూరు ఐటీ కంపెనీ ‘జెన్‌ ఎక్స్‌ ఏఐ’ సంయుక్తంగా దీనిని నిర్వహించాయి. ప్రయోగం జరిగే ప్రాంతానికి జనం పెద్ద ఎత్తున చేరుకోవటంతో నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తి డ్రోన్‌ ఆటో ల్యాండింగ్‌ మోడ్‌లోకి వెళ్లిందన్న వార్తలు వెలువడ్డాయి. అయితే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.


ఇవి కూడా చదవండి

గతేడాది 2.17 లక్షల ఫేక్ కరెన్సీ నోట్ల పట్టివేత.. లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి

రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిపివేత అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటంటే..

For More National News and Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:38 AM