Share News

Rahul Gandhi: కశ్మీర్‌కు చేరుకున్న రాహుల్.. బాధితుల పరామర్శ

ABN , Publish Date - Apr 25 , 2025 | 01:27 PM

రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు వాణిజ్య, పర్యాకక రంగం ప్రతినిధులను కలుసుకోన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను వేర్వేరుగా కలుసుకుంటారు.

Rahul Gandhi: కశ్మీర్‌కు చేరుకున్న రాహుల్.. బాధితుల పరామర్శ

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో క్షతగాత్రులను పరామర్శించేందుకు లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శ్రీనగర్ చేరుకున్నారు. ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో గాయపడిన 26 మందిని బదామిబాగ్ కంటోన్మెంట్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిని రాహుల్ పరామర్శిస్తారని పార్టీ నేతలు తెలిపారు.

Pahalgam Terror Attack: దేశం వీడుతోన్న పాకిస్థానీయులు..


రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు వాణిజ్య, పర్యాకక రంగం ప్రతినిధులను కలుసుకోన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను వేర్వేరుగా కలుసుకుంటారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలోనూ పాల్గొంటారు.


పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు అశువులు బాసిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గురువారంనాడు కీలక సమావేశం ఏర్పాటు చేయడంతో అమెరికాలో ఉన్న రాహుల్ మధ్యలోనే తన పర్యటనను రద్దు చేసుకుని వెనక్కి తిరిగి వచ్చారు.


ఇవి కూడా చదవండి..

Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు

Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్

For National News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 01:28 PM