PMK: రూ.318కే వంటగ్యాస్.. రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:52 PM
పీఎంకే పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ షాడో బడ్జెట్ను రూపొందించి విడుదల చేశారు. రూ.318 లకు వంటగ్యాస్ ఇవ్వాలని, మే 1 నుంచి సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
చెన్నై: రాష్ట్రంలో రూ.318 లకు వంటగ్యాస్ ఇవ్వాలని, మే 1 నుంచి సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని, రాజధాని నగరం చెన్నైలో అందరికీ ఉచిత బస్ సదుపాయం కల్పించాలని పీఎంకే(PMK) సోమవారం విడుదల చేసిన షాడో బడ్జెట్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. ఈ షాడో బడ్జెట్ను పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్(Dr. Ramdas), పార్టీ అధ్యక్షుడు అన్బుమణి విడుదల చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Chenni: కోలుకున్న ముఖ్యమంత్రి మాతృమూర్తి..
మొత్తం 359 ప్రతిపాదనలతో ఈ బడ్జెట్ రూపొందించారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రూ.5.43,442 కోట్లుగా చూపెట్టారు. ఇది గత యేడాదికంటే రూ.1,91,602 కోట్లు అధికమన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు క్వారీలకు బదులుగా ఖనిజవనరుల తవ్వకాలు చేపడితే ఆదాయం వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జూలై 25 జన గణన నిర్వహించాలని, దీనికోసం రూ.400 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జనవరి 25 ప్రపంచ తమిళ మాతృభాషా దినంగా పాటించాలని, ఏప్రిల్ ఒకటి నుండి పాత పింఛన్ పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు. కోయంబేడు బస్స్టేషన్ను ఉద్యానవనంగా మార్చాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Harish Rao: సీఎం రేవంత్ రాజీనామా చేయాలి
కాళేశ్వరం నీరందకనే ఎండుతున్న పంటలు
కేసీఆర్తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్
Read Latest Telangana News and National News