Cyber Attack Alert: పాక్ సైబర్ దాడులు
ABN , Publish Date - May 06 , 2025 | 03:28 AM
భారత రక్షణ వెబ్సైట్లపై పాకిస్థాన్ సైబర్ గ్రూపుల హ్యాకింగ్ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్, డిఫెన్స్ స్టడీస్ ఇన్స్టిట్యూట్లలో సున్నిత సమాచారం చోరీకి పాల్పడినట్టు గ్రూపులు ప్రకటించాయి
గత కొద్దిరోజులుగా భారత రక్షణ వెబ్సైట్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న పాక్ సైబర్ గ్రూపులు.. ఇండియాకు చెందిన మిలటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పర్రీకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వెబ్సైట్లను హ్యాక్ చేసి సున్నితమైన సమాచారాన్ని పొందినట్టు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించుకున్నాయి! ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ను హ్యాక్ చేసి, దాంట్లో ఉన్న భారత యుద్ధ ట్యాంకు స్థానంలో పాక్ యుద్ధ ట్యాంకును పెట్టారు. కాగా.. పహల్గాం ఉగ్రదాడి వెనుక తమ హస్తం ఉందంటూ భారత్ దుష్ప్రచారం చేస్తోందని పాక్ తీవ్రంగా మండిపడింది. భారత ప్రచారాన్ని ఖండిస్తూ పాక్ పార్లమెంటు సోమవారం తీర్మానం చేసింది.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..