Defence: సైన్యం కదలికలపై ప్రత్యక్ష ప్రసారాలొద్దు
ABN , Publish Date - May 10 , 2025 | 05:40 AM
రక్షణ శాఖ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మీడియాను సైనిక కార్యకలాపాలపై సంయమనం పాటించాలని సూచించింది. సున్నితమైన సమాచారం ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల ప్రాణాల ప్రమాదం ఏర్పడవచ్చని హెచ్చరించింది.

మీడియా సంస్థలకు రక్షణ శాఖ సూచన
న్యూఢిల్లీ/అల్వాల్, మే 9 (ఆంధ్రజ్యోతి): సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలపై ప్రత్యక్ష ప్రసారాల విషయంలో మీడియా సంయమనం పాటించాలని రక్షణ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో ఓ పోస్టు చేసింది. ‘సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల కార్యాచరణ ప్రభావం దెబ్బతినడంతో పాటు వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. కార్గిల్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజాక్ ఘటనల వేళ ముందస్తు మీడియా నివేదికలే ప్రమాదాలకు దారితీశాయి. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(సవరణ) చట్ట నిబంధనల మేరకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు సంబంధిత అధికారులే వివరాలు వెల్లడిస్తారు. మీడియా బాధ్యతాయుతంగా ఉండాలని కోరుతున్నాం’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి