High Court: కూలీ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయలేం..
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:11 AM
నటుడు రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయలేమని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రజనీకాంత్ నటించి ఇటీవల విడుదలైన కూలీ చిత్రానికి సెన్సార్బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ పంపిణీ చేయడం వల్ల ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో పిల్లలను అనుమతించడంలేదు.
- మద్రాస్ హైకోర్టు
చెన్నై: నటుడు రజనీకాంత్ ‘కూలీ’ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయలేమని మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఉత్తర్వులు జారీచేసింది. రజనీకాంత్ నటించి ఇటీవల విడుదలైన కూలీ చిత్రానికి సెన్సార్బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ పంపిణీ చేయడం వల్ల ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో పిల్లలను అనుమతించడంలేదు. అందువల్ల ఈ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డుకు ఉత్తర్వులు జారీచేయాలంటూ కూలీ చిత్ర నిర్మాణ సంస్థ సన్టీవీ నెట్వర్క్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది.
ఈ కేసు జస్టిస్ తమిళ్ సెల్వీ ముందు ఇటీవల విచారణకు వచ్చిన సమయంలో సెన్సార్ బోర్డు తరుఫున దాఖలు చేసిన నివేదికలో ఆ చిత్రంలో అధికంగా ఫైటింగ్ సన్నివేశాలు, మద్యం, ధూమపానం సేవించే సన్నివేశాలతో పాటు అసభ్యకరమైన సంభాషణలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో, కూలీ చిత్రాన్ని వీక్షించిన రెండు ప్రత్యేక బృందాలు ఈ చిత్రాన్ని చూసేందుకు చిన్నారులకు అర్హులుకారని నిర్థారించారు.

అందువల్ల ‘ఏ’ సర్టిఫికెట్ పంపిణీ చేయాలని సిఫారసు చేశారు. ఇరుతరుఫు వాదనలు విన్న అనంతరం ఈ కేసు తీర్పును తేదీ ప్రకటించకుండా న్యాయమూర్తి వాయిదా వేశారు. గురువారం మళ్లీ విచారణకు వచ్చిన ఈ కేసులో సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రానికి యూ-ఏ సర్టిఫికెట్ పంపిణీ చేయలేమని ఆదేశించిన న్యాయస్థానం సన్టీవీ నెట్వర్క్స్ పిటిషన్ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News