Share News

Uttarakhand Security: భారత్‌ నేపాల్‌ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

ABN , Publish Date - May 10 , 2025 | 05:16 AM

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో నేపాల్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్‌, చంపావత్‌ జిల్లాల్లో గస్తీ పెంచి చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.

Uttarakhand Security: భారత్‌ నేపాల్‌ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

పిథోరాగఢ్‌, మే 9: భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌- నేపాల్‌ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటున్న ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్‌, చంపావత్‌ జిల్లాల్లో గస్తీని ముమ్మరం చేశారు. సరిహద్దుల్లోని ప్రధాన వంతెనల వద్ద విస్తృత తనిఖీలు చేస్తున్నామని, గస్తీ బృందాల సంఖ్యను కూడా పెంచామని పిథోరాగఢ్‌ ఎస్పీ రేఖ యాదవ్‌ తెలిపారు. అన్ని చెక్‌ పోస్టులను అప్రమత్తం చేశామని, దేశంలోకి అనుమానాస్పద వ్యక్తులు చొరబడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నైని సైని విమానాశ్రయంలో కూడా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయంలోకి ప్రవేశించే ప్రతిఒక్కరి కదలికలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని రేఖ యాదవ్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 05:43 AM