Indus Waters: నాలుగు రాష్ట్రాలకు సింధు జలాల మళ్లింపు
ABN , Publish Date - May 10 , 2025 | 05:25 AM
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్రం, రాజస్థాన్, హరియాణా, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు సింధు జలాలను మళ్లించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసే చర్యలు ప్రగతి చెందుతున్నట్లు జలశక్తి శాఖ తెలిపింది.

రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, హిమాచల్
అవసరాలకు వాడుకోవాలని కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ, మే 9: నాలుగు రాష్ట్రాల అవసరాలు తీర్చుకునేందుకు సింధు నదీ జలాలను మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజస్థాన్, హరియాణా, హిమాచల్ప్రదేశ్, ఢిల్లీ అవసరాలకు సింధు జలాలను వినియోగించుకోవాలని, దీని అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ పనిచేస్తోందని ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చుక్క నీటిని కూడా పాకిస్థాన్కు పోనివ్వకూడదని కేంద్రం భావిస్తోంది. సింధు జలాల వినియోగంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గంట పాటు జరిగిన ఈ సమావేశంలో జలాల మళ్లింపుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి