Share News

Heavy Rains: వాతావరణ కేంద్రం హెచ్చరిక.. పది జిల్లాల్లో భారీ వర్షాలు

ABN , Publish Date - Jul 19 , 2025 | 10:58 AM

రాష్ట్రంలో నీలగిరి, కోవై సహా పది జిల్లాల్లో శనివారం భారీవర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది.

Heavy Rains: వాతావరణ కేంద్రం హెచ్చరిక.. పది జిల్లాల్లో భారీ వర్షాలు

చెన్నై: రాష్ట్రంలో నీలగిరి, కోవై సహా పది జిల్లాల్లో శనివారం భారీవర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ ఆంధ్ర ప్రదేశ్‌(Andhrapradesh), దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. అలాగే, రాష్ట్రం మీదుగా వచ్చే పశ్చిమ గాలుల వేగంలో కూడా మార్పులున్నాయి. ఈ కారణంగా, శనివారం నుంచి ఈ నెల 22వ తేది వరకు రాష్ట్రంలోని ఉరుములు, పిడుగులతో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.


అలాగే, కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, నీలగిరి, కోయంబత్తూర్‌ జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో అతి భారీ వర్షం, తేని, తెన్‌కాశి, కన్నియకుమారి, తిరునల్వేలి, తిరువళ్లూర్‌, రాణిపేట, వేలూరు(Ranipet, Veluru), తిరువణ్ణామలై తదితర జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.


nani1.2.jpg

రాజధాని నగరంలో చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతోకూడిన తేలినపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 25-26 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 10:58 AM