Kumbh Mela 2025: కుంభమేళా యాత్రికులకు కొత్త వెబ్ యాప్.. లాగిన్ లేకుండా ఘాట్లు, పార్కింగ్ సమాచారం..
ABN , Publish Date - Jan 15 , 2025 | 06:24 PM
మహా కుంభమేళా 2025 యాత్రికుల కోసం ఎస్రి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కుంభలొకేటర్ అనే వెబ్ యాప్ను ప్రారంభించింది. దీనిలో లాగిన్ కాకుండానే ఈ యాప్ వినియోగించడం ప్రత్యేకత. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి మహా కుంభమేళా (Kumbh Mela 2025). ఈసారి ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఈ వేడుక జరుగుతోంది. ఈ ఉత్సవానికి ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే యాత్రికులకు ఆధ్యాత్మిక ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు ఎస్రి ఇండియా కొత్తగా ‘కుంభలొకేటర్’ ( https://kumbhlocator.esri.in/) అనే వెబ్ యాప్ ప్రారంభించింది. ఈ యాప్ యాత్రికులకు కీలకమైన సమాచారాన్ని ఒకే చోట అందించడానికి రూపొందించబడింది. ఈ యాప్ ద్వారా యాత్రికులు సులభంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఆ క్రమంలో కుంభమేళా పరిసరాల్లో ఉండే అనేక సౌకర్యాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
సులభమైన నావిగేషన్
ఎస్రి ఇండియా రూపొందించిన ‘కుంభలొకేటర్’ వెబ్ యాప్ యాత్రికులకు, మహా కుంభమేళా ప్రాంతాన్ని సులభంగా నావిగేట్ చేయడానికి అనేక సహాయాలను అందిస్తుంది. ఈ యాప్లో భాగంగా యాత్రికులు స్నానపు ఘాట్లు, పార్కింగ్, రోడ్లపై ప్రత్యక్ష ట్రాఫిక్ సమాచారం, వాతావరణ తాజా సమాచారం తెలుసుకోవచ్చు. దీంతోపాటు ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, తప్పిపోయిన, దొరికిన కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆసుపత్రులు, ఇ-రిక్షా స్టాండ్లు వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలను ఈ యాప్ ద్వారా నావిగేట్ చేయవచ్చు.
అంతర్జాల ఆధారిత సమాచార సౌకర్యాలు
ఈ వెబ్ యాప్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషులో అందుబాటులో ఉంది. ఈ వెబ్ యాప్ను యాత్రికులు ఎటువంటి లాగిన్ లేదా డౌన్లోడ్ అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. యాత్రికులు వారి ఫోన్లలో వెబ్ యాప్ను ప్రదర్శించడం ద్వారా సులభంగా వారి గమ్య స్థానానికి చేరుకోవచ్చు. గూగుల్ మ్యాప్లా ఇది ఇంటరాక్టివ్, రియల్-టైమ్ మ్యాప్లను అందిస్తుంది. తద్వారా యాత్రికులు సులభంగా ఆయా ప్రదేశాలకు నావిగేట్ అవుతారు. మహా కుంభమేళా సందర్శకుల కోసం అతి ముఖ్యమైన సమాచారం ఈ యాప్లో పొందుపరచబడింది.
భద్రతపై ఫోకస్
భద్రత కోసం కూడా ఈ యాప్ కీలకమైన సేవలను అందిస్తుంది. పుణ్యక్షేత్రంలో విస్తృతంగా ఉండే ప్రజల రద్దీని అధిగమించి, యాత్రికులు సురక్షితంగా ఉండేందుకు అన్ని సూచనలు ఈ యాప్ ఇవ్వగలదు. తప్పిపోయిన, దొరికిన కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఆసుపత్రుల ప్రదేశాలు ఈ యాప్లో యాత్రికులకు అందుబాటులో ఉంటాయి. ఇది యాత్రికులకు అవసరమైన సమాచారాన్ని తక్కువ సమయంలో ఇవ్వడానికి ఎస్రి ఇండియా అభివృద్ధి చేసింది. “మా లక్ష్యం, కుంభమేళాకు వచ్చే లక్షలాది యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడం. ఈ వెబ్ యాప్ ద్వారా అన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని ఒకే చోట అందించి, యాత్రికులకు తక్కువ సమయంలో అత్యంత సురక్షితమైన సేవలను అందించగలగడడని ఎస్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్ర కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
Lay offs: ఈ కారణంతో వేల మందిని తొలగిస్తున్న మెటా.. ఉద్యోగుల ఆగ్రహం..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News