Health Minister: రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి..
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:26 AM
వారం రోజులుగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ముందస్తు చర్యలు - అంటువ్యాధుల నిరోధక పనులపై ఆరోగ్య, పురపాలక నిర్వహణ, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో స్థానిక సచివాలయంలో మంగళవారం మంత్రి ఎం.సుబ్రమణ్యం సమావేశమయ్యారు.
- మంత్రి ఎం.సుబ్రమణ్యం
చెన్నై: వారం రోజులుగా డెంగ్యూ జ్వరాల(Dengue Fevers) వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister Subramanyam) తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ముందస్తు చర్యలు - అంటువ్యాధుల నిరోధక పనులపై ఆరోగ్య, పురపాలక నిర్వహణ, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో స్థానిక సచివాలయంలో మంగళవారం మంత్రి ఎం.సుబ్రమణ్యం సమావేశమయ్యారు.

సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో గత జనవరి 1వ తేది నుంచి ఇప్పటివరకు 15,796 మంది డెంగ్యూ జ్వరం బారిన పడ్డారని, వారిలో 8 మంది మృతిచెందారని తెలిపారు. వారం రోజులుగా డెంగ్యూ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలతో ప్రస్తుతం నియంత్రణలో ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa