Share News

Karachi Port: భారత దాడులతో కరాచీ పోర్టు దెబ్బతింది

ABN , Publish Date - May 10 , 2025 | 04:26 AM

భారత్‌ కరాచీ ఓడరేవుపై దాడిచేసిందంటూ తొలుత ఖండించిన కరాచీ పోర్ట్‌ ట్రస్ట్‌.. ఆ తర్వాత దాడి జరిగిందని తెలిపి, మళ్లీ తమ ఖాతా హ్యాక్‌ అయ్యిందని పేర్కొంది. పాక్‌ ఆర్థిక శాఖ కూడా రుణాల కోసం పెట్టిన పోస్టును తాము ఉంచలేదని చెప్పింది.

Karachi Port: భారత దాడులతో కరాచీ పోర్టు దెబ్బతింది

పోర్ట్‌ ట్రస్ట్‌ అధికారిక ‘ఎక్స్‌’లో పోస్ట్‌.. తర్వాత మాటమార్చి మరో పోస్ట్‌

తమ ఖాతా హ్యాకైందని.. పోర్ట్‌ సురక్షితంగానే ఉందని వివరణ

రుణాలతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్‌ వినతి

‘ఎక్స్‌’లో ఆ దేశ ఆర్థిక శాఖ.. ఖాతా హ్యాకైందని ఆ తర్వాత వెల్లడి

న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్‌కు వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన కరాచీ ఓడరేవుపై భారత నౌకాదళం దాడి చేసిందా? అంటే.. చేసిందని, భారత్‌ దాడుల కారణంగా గణనీయమైన డ్యామేజ్‌ జరిగిందని సాక్షాత్తూ కరాచీ పోర్ట్‌ ట్రస్టే తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా వెల్లడించింది! కరాచీ పోర్టుపై భారత నేవీ ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ బ్యాటిల్‌ గ్రూప్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణుల వర్షం కురిపించిందంటూ గురువారం రాత్రి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను ఖండిస్తూ కరాచీ పోర్ట్‌ ట్రస్ట్‌ తొలుత శుక్రవారం ఉదయం ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టింది. పోర్టుపై దాడి జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనాలన్నీ పూర్తిగా అసత్యాలని, ఆధారాల్లేని కథనాలని కొట్టిపారేసింది. పోర్టులో ఓడల రాకపోకలు, కార్గో హ్యాండ్లింగ్‌ ఎప్పటిలాగానే జరుగుతున్నట్టు వెల్లడించింది. కానీ, ఆ తర్వాత గంటకే మాట మార్చి.. భారత దాడుల కారణంగా పోర్టు ఆస్తులకు ఆమోదయోగ్యం కానంత హాని జరిగిందని.. ఈ నేపథ్యంలో అత్యవసర స్పంద న చర్యలు చేపట్టామని.. పునరుద్ధరణపై తరచుగా అప్‌డేట్లు ఇస్తామని పేర్కొంది.


ఈ నష్టం నుంచి తా ము కోలుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. మళ్లీ కొద్దిసేపటికే.. తమ ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌ అయ్యిందం టూ అదే అధికారిక ఖాతాలో మరో పోస్టు పెట్టింది. ‘‘కరాచీ పోర్ట్‌ సురక్షితంగా, భద్రంగా ఉంది’’ అని అందులో వివరించింది. మరోవైపు.. పాక్‌ ఆర్థిక శాఖ కూడా ‘అంతర్జాతీయ భాగస్వాములందరూ తమను రుణాలిచ్చి ఆదుకోవాల’ని కోరుతూ తన ‘ఎక్స్‌’ ఖాతా లో ఒక పోస్టు పెట్టింది. భారత్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంలో సహకరించాలని అందులో విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. తమ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌ అయిందంటూ మరో పోస్టు పెట్టింది. రుణమిచ్చి ఆదుకోవాలంటూ అంతకుముందు పెట్టిన పోస్టు తమది కాదని అందులో పేర్కొంది.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 04:26 AM