CA Exam Postpone: సీఏ పరీక్షలు వాయిదా
ABN , Publish Date - May 10 , 2025 | 05:14 AM
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలతో మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ పరీక్షలను ఐసీఏఐ వాయిదా వేసింది. పరీక్షల కొత్త షెడ్యూలును త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.

న్యూఢిల్లీ, మే 9: దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఆకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అధికారికంగా ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా నిరేఽ్దశించిన తేదీలలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. అయితే మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన మిగిలిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని.. పరీక్షల కొత్త షెడ్యూలును త్వరలో వెల్లడిస్తామని ఐసీఏఐ పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరుకావాల్సిన అభ్యర్థులు మరిన్ని వివరాలను ఐసీఏఐ అధికారిక వెబ్సైట్ జీఛ్చిజీ.ౌటజలో చూసుకోచ్చని తెలిపింది.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి