Share News

BSF: జమ్మూలో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం

ABN , Publish Date - May 10 , 2025 | 04:16 AM

భారత్-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని బీఎ్‌సఎఫ్‌ అడ్డుకొని, ఏడుగురిని హతమార్చి పాకిస్థాన్‌ రేంజర్స్‌ పోస్ట్‌ను ధ్వంసం చేసింది.

BSF: జమ్మూలో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం

ఏడుగురిని హతమార్చిన బీఎ్‌సఎఫ్‌

న్యూఢిల్లీ/జమ్మూ, మే 9: దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను బీఎ్‌సఎఫ్‌ భగ్నంచేసింది. భారత్‌-పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ముష్కరుల ప్రయత్నాలను అడ్డుకుని ఏడుగురిని హతమార్చడమే కాకుండా ఒక రేంజర్స్‌ పోస్ట్‌ను ధ్వంసం చేసినట్టు శుక్రవారం బీఎ్‌సఎఫ్‌ పేర్కొంది. సాంబ జిల్లాలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన పెద్ద గ్రూప్‌ను గుర్తించామని, అనంతరం వారి చొరబాటు చర్యలను అడ్డుకుని ఏడుగురిని మట్టుబెట్టినట్టు తెలిపింది. అలాగే పాకిస్థాన్‌లోని ధంధర్‌ పోస్ట్‌ను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఈ చొరబాటు యత్నానికి పాకిస్థాన్‌ రేంజర్స్‌ పోస్ట్‌ నుంచి కాల్పుల మద్దతు ఉన్నట్టు వెల్లడించింది.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 04:16 AM