Share News

Balochistan: బలూచిస్థాన్‌ రెబెల్స్‌ వశం

ABN , Publish Date - May 10 , 2025 | 05:18 AM

పాక్‌పై తిరుగుబాటుతో ఉన్న బలూచిస్థాన్‌ గ్రూపులు పాక్‌ సైన్యంపై తీవ్ర దాడులకు దిగాయి. క్వెట్టా సహా కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు బీఎల్‌ఏ ప్రకటించింది.

 Balochistan: బలూచిస్థాన్‌ రెబెల్స్‌ వశం

పాక్‌ సైన్యంపై వరుసగా తిరుగుబాటుదారుల దాడులు

కీలక నగరం క్వెట్టా సహా చాలా భాగం మూడు రెబెల్‌ గ్రూపుల స్వాధీనం!

మరోవైపు దాడులకు దిగిన టీటీపీ

20 మంది పాకిస్థాన్‌ సైనికులు హతం

న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న బలూచిస్థాన్‌ తిరుగుబాటుదారులు ఆ ప్రాంతాన్ని తమ వశం చేసుకున్నారు. ఓవైపు భారత్‌పై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాక్‌ తెగబడుతున్న సమయంలో... బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) సహా మూడు తిరుగుబాటు గ్రూపులు అక్కడి పాక్‌ సైనిక స్థావరాలపై దాడులకు దిగాయి. క్వెట్టాలోని ఫైజాబాద్‌ ప్రాంతంలో పాక్‌ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. సిబ్బిలోని మిలటరీ క్యాంపుపై తిరుగుబాటుదారులు గ్రనేడ్లతో దాడికి దిగారు. పాకిస్థాన్‌ ఆర్మీని తరిమికొడుతూ, అక్కడి కీలక నగరం క్వెట్టా సహా చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆరు ప్రాంతాల్లో పాక్‌ దళాలపై ఐఈడీలు, గ్రనేడ్లు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో దాడులు చేశామని బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జియాంద్‌ బలూచ్‌ ప్రకటించారు. మరోవైపు క్వెట్టాలో, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్‌ జెండాలను తొలగించి.. బలూచిస్థాన్‌ జెండాలను ఎగురవేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


దెబ్బ మీద దెబ్బ

పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెహ్రిక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) తీవ్రవాదులు చేసిన దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 20 మంది సైనికులు హతమయ్యారు. పాకిస్థాన్‌, దక్షిణ వజిరిస్థాన్‌లోని షకాయి సబ్‌ డివిజన్‌లో ఉన్న ఓ మిలటరీ ఔట్‌పోస్టుపై గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగినట్టు రిపబ్లిక్‌ వరల్డ్‌ సంస్థ ఓ కథనంలో పేర్కొంది. లేజర్‌ రైఫిల్స్‌ ఉపయోగించి టీటీపీ చేసిన తొలి దాడిలో ఆరుగురు పాక్‌ సైనికులు మరణించారు. మిలటరీ ఔట్‌పోస్టు రక్షణకు బయలుదేరిన రెండు సైనిక వాహనాలపైనా టీటీపీ దాడి చేసింది. మొత్తంగా 20 మంది పాక్‌ సైనికులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని టీటీపీ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 05:18 AM