Share News

Asaduddin Owaisi: స్వదేశంలో భద్రతకే మొగ్గు కానీ పాక్‌కు మద్దతు

ABN , Publish Date - May 10 , 2025 | 05:23 AM

పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంపై హైదరాబాదుకు చెందిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. తుర్కీయే సొంత గడ్డపై ఉగ్రవాదంతో పోరాటం చేస్తుండగా, భారత్‌ ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ప్రశ్నించడం ఎలా అనేది ఆయన ప్రశ్నించారు.

Asaduddin Owaisi: స్వదేశంలో భద్రతకే మొగ్గు కానీ పాక్‌కు మద్దతు

తుర్కియే ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించిన ఒవైసీ

న్యూఢిల్లీ, మే 9: సొంతగడ్డపై దేశ భద్రతకు ప్రాధాన్యమిస్తున్న తుర్కియే అంతర్జాతీయ ఉగ్రవాదానికి నెలవుగా మారిన పాకిస్థాన్‌కు ఎలా తిరుగులేని మద్దతునిస్తుందని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ‘మనం తుర్కియేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన సొంతగడ్డపై ఉగ్రవాద సంస్థ కుర్దిష్‌ గ్రూపుపై బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇరాక్‌లోనూ ఉగ్రవాదులపై బాంబులు వేయడానికి వెనుకంజ వేయదు. తాజాగా సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై బాంబులేస్తుంది. విదేశీ గడ్డపై ఉగ్రవాదులను అంతమొందిస్తారు. కానీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పందిస్తున్న భారత్‌ను ఎలా ప్రశ్నిస్తారని ఆ దేశాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది..?’ అని ఒవైసీ స్పష్టం చేశారు. తమ దేశ భద్రతకు ఉగ్రవాదులపై అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడబోమని గత డిసెంబర్‌లో తుర్కియే మంత్రి హకన్‌ ఫిదాన్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 05:23 AM