-
-
Home » Mukhyaamshalu » Today Latest Breaking News Live Updates in Telugu 5th January 2025 Siva
-
Breaking News: పల్నాడు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు
ABN , First Publish Date - Jan 05 , 2025 | 10:01 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-05T17:39:15+05:30
ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు
పల్నాడు జిల్లాలో విషాదం
సత్తెనపల్లి అమరావతి బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతు
కాలువలో ఈతకు దిగిన ఐదుగురు బాలురు
గల్లంతైన గొపిచందు, చరణ్
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు
విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
2025-01-05T13:17:24+05:30
అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు..
మాదాపూర్: అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.
సుమారు రెండు గంటల నుండి కొనసాగుతున్న కూల్చివేతలు.
మొదటగా భవనం వెనుక భాగం నుండి నేలమట్టం చేస్తున్న అధికారులు.
ఇప్పటి వరకు రెండు అంతస్తుల వరకు గోడలు కూల్చిన బుల్డోజర్.
మరికొద్ది సేపట్లో రానున్న భారీ బాహుబలి మిషన్.
బాహుబలి మిషన్ వచ్చిన తరువాత పిల్లర్లు కూల్చి నేలమట్టం చేసే అవకాశం.
-
2025-01-05T13:14:05+05:30
గుడివాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.
కృష్ణా జిల్లా: గుడివాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.
రైలుపేటలో జరిగిన దారుణ ఘటన.
చిన్నారికి గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స.
ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన టూ టౌన్ పోలీసులు.
రైలు పేటలోని బాలిక ఇంటి వద్ద స్వయంగా విచారణ చేపట్టిన గుడివాడ డిఎస్పీ అబ్దుల్ సుబాన్.
అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఎండూరి జోజి బాబు (42)గా గుర్తింపు.
కామాంధుడిని అదుపులో తీసుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం.
బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న జోజి బాబు.
-
2025-01-05T13:03:14+05:30
ప్రారంభమైన వీహెచ్పీ హైందవ శంఖారావం సభ
అమరావతి: కేసరపల్లిలో ప్రారంభమైన వీహెచ్పీ హైందవ శంఖారావం సభ
వేదిక పైఆశీనులైన ఉత్తరాది దక్షిణాదికి చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు
వీహెచ్పీ ప్రతినిధులు గోకరాజు గంగరాజు, అలోక్కుమార్, మిలింద్ పరాండ్, కోటేశ్వర శర్మ,
సభా వేదిక ముందు ఆహుతులతో కలిసి కింద సీట్లలో కూర్చున్న బిజెపి నేతలు పురంధేశ్వరి, సత్యకుమార్, విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్.
స్వామీజీల శంఖారావాలతో సభ ప్రారంభం.
జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం.
-
2025-01-05T10:47:30+05:30
కేసర్పల్లిలో వీహెచ్పీ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం.
ఆలయాల పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్తో జాతీయ ఉద్యమం.
దేశ వ్యాప్త పోరాటానికి విజయవాడ నుంచి ప్రారంభం.
అన్ని రాష్ట్రాల్లో హైందవ శంఖారావం సభలు.
నేడు శంఖారావ సభలో పాల్గొననున్న వీహెచ్పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు.
మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు.
మధ్యాహ్నం 12 తరువాత సభ ప్రారంభం.
భారతీయ సంస్కృతి, జానపద కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులు.
జై శ్రీరామ్ అనే నినాదంతో మారుమోగుతున్న సభా ప్రాంగణం, రోడ్లు.
హిందూ జాతీయ ఉద్యమానికి మూడు లక్షల మందితో తొలి సభకు నేడు అంకురార్పణ.
-
2025-01-05T10:43:32+05:30
చిక్కడపల్లి పీఎస్కు అల్లు అర్జున్..
సంధ్య థియేటర్ ఘటనలో విచారణకు హాజరైన అర్జున్.
ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు ఆదేశం.
-
2025-01-05T10:35:33+05:30
సినిమాలకు టికెట్ల ధరలు పెంచడాన్ని ఖండించిన సీపీఐ..
అమరావతి: ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ల ధరలు పెంచడాన్ని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600, మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా రూ.135 పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం దుర్మార్గం.
ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంపుపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదు.
ప్రజల అభిమానాన్ని బలహీనతగా చూడటం తగదు.
తెలంగాణ తరహాలో ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిని రద్దు చేయాలి.
-
2025-01-05T10:34:28+05:30
హైదరాబాద్ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు..
హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు.
సిటీలో 9 సెంటర్లలో ముత్యాల ముగ్గుల పోటీలు.
KPHB జిహెచ్ఎంసి బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో భారీగా పాల్గొన్న మహిళలు.
ముత్యాల ముగ్గుల పోటీలను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు.
-
2025-01-05T10:01:34+05:30
అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు..
అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్పేట పోలీసులు.
కిమ్స్ లో శ్రీ తేజ పరామర్శకు రావద్దనీ నోటీస్.
అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీస్ అందచేసిన పోలీసులు.