Share News

BREAKING: పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలో ఏపీ ఫస్ట్..

ABN , First Publish Date - Dec 14 , 2025 | 01:01 PM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలో ఏపీ ఫస్ట్..

Live News & Update

  • Dec 14, 2025 20:33 IST

    • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్

  • Dec 14, 2025 19:46 IST

    పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలో ఏపీ ఫస్ట్..

    • అమరావతి: పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్..

    • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం..

    • దేశం మొత్తం మీద పండ్లు, చేపల ఉత్పత్తిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న రాష్ట్రం..

    • పండ్ల తోటల సాగులో రెండవ స్థానంలో నిలిచిన ఏపీ..

    • ఆంధ్రప్రదేశ్ సగటు జీవిత కాలం 70 ఏళ్ళు ఉన్నట్టు వెల్లడించిన ఆర్బీఐ నివేదిక.

  • Dec 14, 2025 19:42 IST

    ఆఖండ-2 థియేటర్‌లో పగిలిన స్పీకర్లు..

    • కర్నూలు : ఆదోనిలోని ద్వారకా థియేటర్‌లో ఆఖండ-2 ప్రదర్శన..

    • సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు పగిలిన స్పీకర్లు..

    • స్పీకర్ బాక్స్‌ల నుంచి పొగలు రావడంతో భయందోలనకు గురైన ప్రేక్షకులు..

    • చిత్ర ప్రదర్శనను కాసేపు నిలిపివేసి మరమ్మతులు..

    • మరమ్మతుల అనంతరం ప్రదర్శనను కొనసాగించిన థియేటర్ యాజమాన్యం.

  • Dec 14, 2025 19:35 IST

    • ప్రకాశం : గిద్దలూరులో వీధి కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులకి గాయాలు.

    • చిన్నారులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

  • Dec 14, 2025 18:22 IST

    రేపు ఢిల్లీకి.. మంత్రి నారా లోకేష్

    • రేపు ఢిల్లీకి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్..

    • కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలువనున్న లోకేష్..

    • రాష్ట్రానికి చెందిన పలు సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్న లోకేష్..

    • కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం..

    • రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్న లోకేష్..

    • ఎల్లుండి విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న లోకేష్.

  • Dec 14, 2025 17:23 IST

    బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్‌

    • బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్‌ను నియమించిన అధిష్టానం

    • ప్రస్తుతం బీహార్ రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ నబిన్.

  • Dec 14, 2025 15:12 IST

    సిడ్నీలో కాల్పుల కలకలం

    • ఆస్ట్రేలియా: సిడ్నీలో కాల్పుల కలకలం

    • బాండీ బీచ్‌లో పర్యాటకులపై దుండగుల కాల్పులు..

    • 10 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు..

    • సెక్యూరిటీ దుస్తుల్లో వచ్చి దుండగుల కాల్పులు.

  • Dec 14, 2025 15:03 IST

    ఎస్‌ఐపై వేటు..

    • పల్నాడు: చిలకలూరిపేట అర్బన్ ఎస్‌ఐ రహ్మతుల్లాపై వేటు..

    • ఇటీవల రోడ్డు ప్రమాదంలో యువకుల మృతికి కారణమైన ASI కుమారుడు..

    • కుమారుడికి ASI రహ్మతుల్లా సహకరించినట్లు తేలడంతో ఎస్పీ చర్యలు..

    • కుమారుడి ముఠా అక్రమ వసూళ్లకు సహకరించిన ఎస్‌ఐ రహ్మతుల్లా.

  • Dec 14, 2025 13:37 IST

    సంతమాగులూరులో దారుణం..

    • బాపట్ల : సంతమాగులూరులో దారుణం..

    • భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి చంపిన భర్త వెంకటేశ్వర్లు..

    • మృతదేహాన్ని బైక్ పై పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి లొంగిపోయిన భర్త వెంకటేశ్వర్లు..

    • సంతమాగులూరు పోలీసుల అదుపులో నిందితుడు.

  • Dec 14, 2025 13:19 IST

    నెల్లూరు మేయర్ రాజీనామా..

    • నెల్లూరు: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా..

    • నేడు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి రాజీనామా లేఖ అందజేయనున్న మేయర్..

    • మరో 4 రోజుల్లో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం..

    • ఆసక్తిగా మారిన నెల్లూరు మేయర్ రాజీనామా అంశం..

    • ఇప్పటికే కార్పొరేటర్లను క్యాంప్‌కి తరలించిన అధికార పార్టీ..

    • వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న కార్పొరేటర్లు..

    • 52 మంది సభ్యుల్లో 42కు చేరిన టీడీపీ సభ్యుల బలం..

    • మేయర్ రాజీనామా ఆమోదిస్తే అవిశ్వాసం లేనట్టే..

    • ఈసీ అనుమతించాక నెల్లూరు మేయర్ ఎన్నిక.

  • Dec 14, 2025 13:05 IST

    రేపు ఢిల్లీ పర్యటనకు మంత్రి లోకేష్‌

    • రేపు కేంద్రమంత్రులతో మంత్రి నారా లోకేష్‌ సమావేశం..

    • ఎల్లుండి ఢిల్లీ నుంచి విశాఖకు మంత్రి లోకేష్‌..

    • విశాఖలో GMR ఏవియేషన్‌ ఎడ్యుసిటీ ప్రారంభించనున్న లోకేష్‌.

  • Dec 14, 2025 13:03 IST

    రైలు నుంచి పొగలు..

    • కాకినాడ: అన్నవరం రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి పొగలు

    • సిల్ఘటన్ నుంచి తాంబరం వెళ్తున్న ట్రైన్

    • అన్నవరం రాగానే రైలు ఎస్ 7 బోగి నుంచి ఎయిర్ బ్రేక్ నుంచి గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా వ్యాపించిన పొగ..

    • భయాందోళనకు గురై ఫ్లాట్ ఫారం పైకి దూకేసిన ప్రయాణికులు..

      • కాసేపటికీ మర్మమ్మతులు చేయడంతో బయలుదేరిన ట్రైన్.