IRCTC Shirdi Tour Package: బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజ్
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:18 PM
షిర్డీ సాయిబాబా భక్తులకు IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీకి ప్రతిరోజూ వేలాది మంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. బస్సులు, రైళ్లు లేదా వ్యక్తిగత వాహనాల్లో ఈ యాత్ర చేస్తుంటారు. అయితే, సాధారణ మధ్యతరగతి ప్రయాణికుల కోసం IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే ప్రత్యేక షిర్డీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఈ నెలలో టూర్ ప్రారంభం కానుంది. 2 రాత్రులు, 3 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది.

యాత్ర వివరాలు:
IRCTC వెబ్సైట్ https://www.irctctourism.com/ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ నెల అక్టోబర్ 29 తేదిన ఈ టూర్ ప్రారంభమవుతుంది.
కాచిగూడ రైల్వే స్టేషన్లో సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ప్రయాణం మొదలవుతుంది.
రైలు నెంబర్ 17064
ఈ టూర్ ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.
ప్రయాణంలో కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ఎక్కే అవకాశం ఉంటుంది.
రాత్రంతా ప్రయాణం తర్వాత మహారాష్ట్రలోని నాగర్ సొల్ చేరుకొని, తరువాత షిర్డీకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
హోటల్లో చెక్-ఇన్ తరువాత షిర్డీ ఆలయ దర్శనం.
సాయంత్రం 5 గంటలకు తిరిగి హోటల్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటల లోపు నాగర్ సొల్ చేరాల్సి ఉంటుంది.
అలా మళ్లీ రాత్రంతా ప్రయాణం చేసిన తర్వాత కాచిగూడకు ఉదయం 9:45కి చేరుతుంది.

టికెట్ ధరలు:
సింగిల్ షేరింగ్ రూ. 7,890
డబుల్ షేరింగ్ రూ. 6,660
ట్రిపుల్ షేరింగ్ రూ. 6,640
కంఫర్ట్ క్లాస్:
ట్రిపుల్ షేరింగ్ రూ. 4,960
డబుల్ షేరింగ్ రూ. 4,980
సింగిల్ షేరింగ్ రూ. 6,220
ప్రతి బుధవారం ఈ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలను IRCTC ఆఫీషల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు
Read Latest AP News And Telugu News