Share News

Places To Visit in November: వింటర్ స్పెషల్.. ప్రయాణికులకు బెస్ట్ టూరిస్టు ప్లేసెస్ ఇవే

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:55 PM

నవంబర్‌లో ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. చల్లని వాతావరణం, మంచుతో కప్పబడిన పర్వతాలు ప్రకృతిని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. కాబట్టి..

Places To Visit in November: వింటర్ స్పెషల్.. ప్రయాణికులకు బెస్ట్ టూరిస్టు ప్లేసెస్ ఇవే
Places To Visit in November

ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ నెలలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణం చల్లగా, ప్రశాంతంగా మారుతుంది. పచ్చదనంతో వాతావరణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు ప్రకృతిని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ వింటర్ సీజన్‌లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, మన దేశంలోనే ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందులోని కొన్ని ప్రాంతాలు ఇంకా సూపర్‌గా ఉంటాయి. సో లేట్ చేయకుండా ఈ సీజన్‌లో ప్రయాణించాల్సిన బెస్ట్ టూరిస్టు ప్లేసెస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


మనాలి

మనాలి ఒక అందమైన ప్రదేశం, ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది ఒడ్డున ఉన్న ఒక రిసార్ట్ పట్టణం. ఇక్కడ హిడింబి దేవి ఆలయం, సోలాంగ్ లోయ, రోహ్‌తాంగ్ పాస్ వంటి అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు, దట్టమైన అడవులు దీని అందాన్ని మరింత పెంచుతాయి.

Dargling.jpg

డార్జిలింగ్

పశ్చిమ బెంగాల్‌లో ఉన్న డార్జిలింగ్‌ను కొండల రాణి అని పిలుస్తారు. ఇది హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఒక అద్భుతమైన హిల్ స్టేషన్. చల్లని వాతావరణం, పొగమంచుతో కప్పిన కొండలు, సూర్యోదయ దృశ్యాలు ఇవన్నీ కలిపి డార్జిలింగ్‌ను ఒక కలల ప్రదేశంగా మారుస్తాయి. ఉదయం సూర్యోదయం నుంచి రాత్రి పొగమంచు వరకు ప్రతి క్షణం మనసును మాయ చేసే అందాలు ఇక్కడ కనిపిస్తాయి.

Ooty.jpg

ఊటీ

తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న ఊటీని దక్షిణ భారత స్విట్జర్లాండ్ అంటారు. ఇది ఒక సుందరమైన హిల్ స్టేషన్. ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యంతో, పచ్చని టీ తోటలతో, పొగమంచు కప్పిన కొండలతో పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


వారణాసి

వారణాసి ఆధ్యాత్మిక వాతావరణంతో ఉంటుంది. మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ నగరం ఘాట్‌లు, దేవాలయాలు, పురాతన ఆచారాలకు చాలా ప్రసిద్ధి చెందింది. గంగా ఆరతి వంటి ఆచారాలు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.

Varanasi.jpg

హంపి

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపి ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది పూర్వపు విజయనగర సామ్రాజ్యం రాజధాని, తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అనేక స్మారక చిహ్నాలకు నిలయం. ఈ ప్రదేశం అద్భుతమైన ఆలయాలు, కోటలు, ప్యాలెస్‌లు, ఇతర కట్టడాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది.


Also Read:

శీతాకాలం.. ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? జాగ్రత్త!

ఫారన్ ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా?‌.. ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్

For More Latest News

Updated Date - Nov 12 , 2025 | 01:43 PM