Share News

Gongura Chepala Pulusu: గోంగూరతో చేపల పులుసు.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:54 PM

పుల్లపుల్లగా ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర చేపల పులుసును మీరు ఎప్పుడైనా తిన్నారా? దీని టేస్ట్ అదిరిపోతుంది. అయితే, ఈ గోంగూర చేపల పులుసును ఎలా చేస్తారో మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Gongura Chepala Pulusu: గోంగూరతో చేపల పులుసు.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
Gongura Chepala Pulusu

ఇంటర్నెట్ డెస్క్: చేపల పులుసు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, చేపలతో ఎప్పుడూ చేసుకునే వంటలకు బదులుగా ఈ సండే మరింత స్పెషల్‌గా ఉండేలా గోంగూరతో చేపల పులుసును ట్రై చేయండి. పుల్లపుల్లగా ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర చేపల పులుసు టేస్ట్ అదిరిపోతుంది. అయితే, ఈ గోంగూర చేపల పులుసును ఎలా చేస్తారో మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


Gongura chepala Pulusu (2).jpg

గోంగూర చేపల పులుసుకు కావలసిన పదార్థాలు:

  • ½ కేజీ శుభ్రం చేసిన చేపలు

  • 1 కట్ట ఎర్ర గోంగూర

  • 1 పెద్ద ఉల్లిపాయ (తరుగు)

  • 2 టమోటాలు (పేస్ట్)

  • ఉప్పు (రుచికి సరిపడా)

  • 2 ఎండు మిరపకాయలు

  • 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్

  • 2 టేబుల్ స్పూన్ల కారం

  • ½ టీస్పూన్ పసుపు

  • 1 స్పూన్ వేయించిన మెంతి పొడి

  • 1 స్పూన్ ధనియాల పొడి

  • ½ టీస్పూన్ గరం మసాలా

  • 1 స్పూన్ జీలకర్ర

  • 1 స్పూన్ ఆవాలు

  • 1 కొత్తిమీర తరుగు

  • ½ కప్పు నూనె


తయారీ విధానం:

  • ముందుగా, ఒక గిన్నెలో శుభ్రం చేసిన చేప ముక్కలను తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి 15-20 నిమిషాలు మసాలాలు పడనివ్వండి.

  • తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, అందులో నూనె వేసి వేడి చేసుకోండి.

  • వేడి నూనెలో చేప ముక్కలను వేసి తక్కువ మంట మీద బాగా వేపండి. రెండు వైపులా బంగారు రంగులో వేగాక, చేపలు తీసి పక్కన పెట్టండి.

  • కడాయిలో మిగిలిన నూనెలో జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు వేసి, తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేగించాలి.

Gongura chepala Pulusu (1).jpg

  • ఉల్లిపాయలు పసుపు రంగులో మారిన తరువాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, దాని పచ్చివాసన పోయేంత వరకు వేగించండి.

  • ఇప్పుడు ఎర్ర గోంగూర వేసి బాగా మగ్గించాలి.

  • గోంగూర మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మెంతి పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి, టమోటా పేస్ట్ వేసి ఉడికించాలి.

  • టమోటా పేస్ట్ బాగా ఉడికిన తర్వాత 1 ½ గ్లాసు నీళ్లు వేసి మరిగించాలి.

  • ఈ మసాలా రసంలో ముందుగా వేపిన చేప ముక్కలను వేసి, తక్కువ మంటపై 15-20 నిమిషాలు ఉడికించండి.

  • చేపలు బాగా ఉడికిన తరువాత, కూర నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోండి.

  • చివరగా కొత్తిమీర తరుగు వేసి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలా, మీ రుచికరమైన గోంగూర చేపల పులుసు సిద్ధమవుతుంది.

  • ఈ గోంగూర చేపల పులుసు పుల్లగా, రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.


(NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 14 , 2025 | 01:02 PM