Share News

Government Order: సోషల్‌ మీడియాపై నిషేధం ఎందుకు

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:30 AM

ప్రసంగాలు, ఫేక్‌ ప్రొఫైల్స్‌, సైబర్‌ నేరాలు, ఫేక్‌న్యూస్‌ వ్యాప్తి వంటి కేసులను విచారించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..

Government Order: సోషల్‌ మీడియాపై నిషేధం ఎందుకు

ప్రసంగాలు, ఫేక్‌ ప్రొఫైల్స్‌, సైబర్‌ నేరాలు, ఫేక్‌న్యూస్‌ వ్యాప్తి వంటి కేసులను విచారించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేపాల్‌ ప్రభుత్వం ఐటీ, కమ్యూనికేషన్స్‌ చట్టం ప్రకారం సామాజిక మాధ్యమాలన్నీ రిజిస్టర్‌ చేసుకోవాలని గత నెల 28న ఆదేశాలిచ్చింది. అందుకోసం వారం రోజులు గడువిచ్చింది. అలా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సంస్థలు ప్రభుత్వం కోరిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అభ్యంతరకరమైన పోస్టులను తొలగించాలని పేర్కొంటే.. సామాజిక మాధ్యమ సంస్థలు ఆ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వం, పౌరులు ఇచ్చే లీగల్‌ నోటీసులకు కచ్చితంగా స్పందించేందుకు నేపాల్‌లో అధికారులను నియమించాలి. టిక్‌టాక్‌, వైబర్‌, విట్క్‌, నిబంజ్‌, పోపోలైవ్‌ వంటి సంస్థలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. టెలిగ్రామ్‌, గ్లోబల్‌ డైరీ సంస్థలు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆమోదం పెండింగ్‌లో ఉంది. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, యూట్యూబ్‌ సహా.. 26 సామాజిక మాధ్యమ సంస్థలు మాత్రం రిజిస్ట్రేషన్‌కు సుముఖంగా లేవు. భారత్‌లో ఇలాంటి నిబంధనకు కట్టుబడిన ఆయా సంస్థలు తమ దేశంలో విముఖంగా ఉండడంతో.. ప్రభుత్వం ఈ నెల 3న వాటిని నిషేధించింది.


ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 03:30 AM