Share News

Nepal floods: నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు.. 18 మంది మృతి

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:40 PM

మొన్నటి వరకూ జెన్ జెడ్ ఆందోళనతో అట్టుడికిన దాయాది దేశం నేపాల్.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమౌతోంది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలం సెప్టెంబర్ చివరి వారంతో ముగిసినప్పటికీ..

Nepal floods: నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు.. 18 మంది మృతి
Nepal floods

నేపాల్‌, అక్టోబర్ 5 : మొన్నటి వరకూ జెన్ జెడ్ ఆందోళనతో అట్టుడికిన దాయాది దేశం నేపాల్.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమౌతోంది. కుండపోత వర్షాలు, పెల్లుబికుతున్న వరదలతో ఇప్పటి వరకూ ఆదేశంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని ఇలమ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. గత 24 గంటల్లో మృతుల సంఖ్య ఈ స్థాయికి చేరడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Nepal-Floods-3.jpgమృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కోషి ప్రావిన్స్ పోలీస్ ప్రతినిధి ఎస్‌ఎస్‌పి దీపక్ పోఖ్రేల్ పేర్కొన్నారు. 'వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్రస్తుతం ప్రాథమిక వివరాలు మాత్రమే తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.


ఇలమ్ జిల్లాలోని సూర్యోదయ మున్సిపాలిటీలో 5 మంది, మాంగ్సెబుంగ్ మున్సిపాలిటీలో ముగ్గురు, ఇలమ్ మున్సిపాలిటీలో ఆరు మంది, డెయుమై మున్సిపాలిటీలో ముగ్గురు, ఫాక్‌ఫోక్‌థుమ్ విలేజ్ కౌన్సిల్‌లో ఒక్కరు మరణించారని సదరు అధికారి తెలిపారు.

Nepal-Floods-1.jpgనేపాల్లో వర్షాకాలం సెప్టెంబర్ చివరి వారంతో ముగిసినప్పటికీ, మళ్లీ వర్షాలు ముంచెత్తడంతో వరదలు, కొండచెరియలు విరిగిపడ్డం తదితర ఉపద్రవాలు సంభవించాయి. ఈ ఏడాది వర్షాలు గట్టిగా పడతాయనే అంచనా ఉన్నప్పటికీ, ఈనెల (అక్టోబర్) లో కురిసిన అకాల వర్షాల కారణంగా ఇంతటి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.


కాఠ్మాండూ వ్యాలీలో నదులు (బాగ్మతి, హనుమంతే, మనోహరా మొదలైనవి) నీటి స్థాయిలు పెరిగి, వరదలు, ల్యాండ్‌స్లైడ్‌లకు కారణమవుతున్నాయి. సున్సరి, ఉదయ్‌పూర్, సప్తరి, సిరాహా, ధనుషా, మహోత్తరి, సర్లాహి, రౌతహట్, బరా, పార్సా, సింధులి, డోలఖా, రామెఛాప్, సింధుపాల్‌చోక్, కవ్రేపాలాన్‌చోక్, కాఠ్మాండూ, లాలిత్పూర్, భక్తపూర్, మక్వాన్‌పూర్, చిత్వాన్ జిల్లాల్లో హై రిస్క్ ఉందని హైడ్రాలజీ అండ్ మెటియరాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది.

Nepal-Floods-2.jpgరెస్క్యూ ఆపరేషన్లకు నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీస్ అన్ని ప్రభావిత ప్రాంతాల్లో మోహరించాయి. కాఠ్మాండూ వ్యాలీలో ప్రధాన నది చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నివాసితులు, వాహనదారులు నదీ సమీపంలో ప్రయాణం చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2025 | 12:41 PM