Share News

UPI New Rules: నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్..ఏకంగా రూ.10 లక్షల వరకు

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:41 AM

ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ వినియోగించేవారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి (సెప్టెంబర్ 15, 2025) నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లిమిట్స్‌లో కీలక మార్పులను తీసుకొచ్చింది.

UPI New Rules: నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్..ఏకంగా రూ.10 లక్షల వరకు
UPI New Rules

డిజిటల్ లావాదేవీలు తరచూ వినియోగించే వారికి శుభవార్త వచ్చేసింది. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే వారికి ఓ కీలక మార్పు (UPI new rules) ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ వినియోగదారుల వరకు అందరికీ ఉపయోగపడేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి.


ఒకే ట్రాన్సాక్షన్‌తో

ఇంతకు ముందు ఇన్సూరెన్స్ ప్రీమియమ్ లేదా లోన్ ఈఎంఐలు చెల్లించాలంటే, లిమిట్ తక్కువ ఉండటం వల్ల రెండు, మూడు సార్లు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. కొత్త రూల్స్ ప్రకారం, ఒక్కో ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు. ఒక రోజులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. అంటే, మీ ఇన్సూరెన్స్ ప్రీమియమ్ లేదా హోమ్ లోన్ ఈఎంఐ ఒకే సారి క్లియర్ చేసుకోవచ్చు.


క్రెడిట్ కార్డ్ బిల్స్, ట్రావెల్ బుకింగ్స్

క్రెడిట్ కార్డ్ బిల్స్ చెల్లించడం కోసం ఇప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. కొత్త రూల్స్ ప్రకారం, ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా రూ.6 లక్షల వరకు క్రెడిట్ కార్డ్ బిల్ క్లియర్ చేయొచ్చు. అలాగే, ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ లాంటివి కూడా ఒకే ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల వరకు, రోజుకి రూ.10 లక్షల వరకు చెల్లించొచ్చు. ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


బిజినెస్‌కి బూస్ట్

మీరు జ్యువెలరీ కొనాలనుకుంటే, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల వరకు, రోజుకి గరిష్టంగా రూ.6 లక్షల వరకు చెల్లించొచ్చు. బిజినెస్ లేదా మర్చంట్ పేమెంట్స్‌కి కూడా రూ.5 లక్షల వరకు ఒకే ట్రాన్సాక్షన్‌లో చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో రోజువారీ లిమిట్ లేదు. అంటే, షాప్‌కీపర్స్, బిజినెస్ ఓనర్స్‌కి ఇది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. పెద్ద లావాదేవీలు సులభంగా, ఫాస్ట్‌గా పూర్తి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

కానీ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి డబ్బు పంపే లిమిట్‌లో ఎలాంటి మార్పూ లేదు. అంటే, రోజుకి గరిష్టంగా రూ.1 లక్ష వరకు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 11:49 AM