Stock Markets: రెండో రోజు లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు.. ఇవే టాప్ 5 స్టాక్స్
ABN , Publish Date - Jan 30 , 2025 | 10:26 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల్లోనే దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం గ్రీన్ లోనే ఉన్నాయి. అయితే సూచీలు ఏ మేరకు పెరిగాయనే విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్లు (stock markets) వరుసగా రెండో రోజు గురువారం కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే కొన్ని రంగాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కొన్ని నష్టాలతో ప్రారంభమైనా, ఆ తర్వాత పెరిగాయి. ఆటో, ఐటీ రంగాలు నష్టాల్లో ఉండగా, ఇతర రంగాలు లాభాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 134.74 పాయింట్లు పెరిగి 76,667.70 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 66.60 పాయింట్లు లాభపడి 23,229.70 వద్ద ట్రేడైంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 91 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 372 పాయింట్లు వృద్ధి చెందింది.
ఇవే టాప్ 5 స్టాక్స్..
ఈ నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ONGC కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, ICICI బ్యాంక్, HDFC లైఫ్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంచి లాభాలను దక్కించుకున్నారు. టాటా మోటార్స్ మూడో త్రైమాసిక ఫలితాల్లో లాభాల క్షీణతతో బలహీనపడింది.
ముఖ్యంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) విభాగం, దేశీయ కార్ల అమ్మకాల్లో తగ్గుదల కారణంగా టాటా మోటార్స్ షేర్లు దాదాపు 8.5% పడిపోయాయి. దీంతో ఆటో ఇండెక్స్ మొత్తం 1.2% క్షీణించింది. ఐటీ రంగంలో కూడా లాభాలు తగ్గాయి, ఐటీ ఇండెక్స్ 0.5% పడిపోయింది. ప్రస్తుతం 13 ప్రధాన రంగాలలో తొమ్మిది రంగాలు లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ స్టాక్స్ వరుసగా 0.5%, 0.4% పెరిగాయి.
ఈ కంపెనీల ఫలితాలు..
ప్రత్యేకంగా నాన్-బ్యాంక్ లెండర్ బజాజ్ ఫైనాన్స్ తన పన్ను తర్వాత లాభాన్ని 4% పెంచుకుంది. కంపెనీ తన డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్లో 17% వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు 4% పెరిగాయి. JK పేపర్ షేర్లు గురువారం 10.8 శాతం పడిపోయి, ఒక్కో షేరుకు రూ. 340.05 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని నమోదు చేశాయి. కంపెనీ బలహీనమైన Q3FY25 ఫలితాలను పోస్ట్ చేసిన తర్వాత స్టాక్లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం 9:32 గంటల ప్రాంతంలో, BSEలో JK పేపర్ షేర్ ధర 5.96 శాతం తగ్గి రూ.358.85 వద్ద ఉంది. పోల్చితే, BSE సెన్సెక్స్ 0.01 శాతం పెరిగి 76,542.37 వద్ద ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,079 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి షేరుకు రూ.639.15 మరియు 52 వారాల కనిష్ట స్థాయి షేరుకు రూ.319.2 వద్ద ఉంది.
ఒప్పందాల నేపథ్యంలో..
జీఆర్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ ఒక మంచి అప్డేట్తో లాభాలు రాబట్టింది. ఈ కంపెనీ రూ.262 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టును గెలుచుకుంది. ఈ ప్రాజెక్టు వెస్ట్రన్ రైల్వే పరిధిలోని కోసాంబ నుంచి ఉమర్పాడ వరకు 38.9 కి.మీ ట్రాక్ గేజ్ మార్పిడి ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ వార్త నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు ర్యాలీ చేశాయి.
ఇతర ప్రముఖ కంపెనీలలో ఒకటైన సాగిలిటీ ఇండియా షేర్లు 5% అప్పర్ సర్క్యూట్ను తాకాయి. కంపెనీ తన అనుబంధ సంస్థ బ్రాడ్పాత్ హెల్త్కేర్ సొల్యూషన్స్ను రూ. 502 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ కొనుగోలు స్టాక్కు మరింత బలాన్ని ఇచ్చింది.
మరొక ముఖ్యమైన అప్డేట్ వర్ల్పూల్ ఇండియా నుంచి వచ్చింది. కంపెనీ తన మాతృ సంస్థ వర్ల్పూల్ కార్పొరేషన్ నుంచి 20% వాటాను ఆఫ్లోడ్ చేయాలని భావిస్తోంది. ఈ వార్తతో వర్ల్పూల్ ఇండియా షేర్లు 20% పడిపోయి, లోయర్ సర్క్యూట్ను తాకాయి.
బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ షేర్లు 8% పెరిగాయి. ఇది కంపెనీ తన మూడో త్రైమాసిక ఫలితాల్లో 321% PAT వృద్ధిని నమోదు చేసిన తర్వాత వచ్చింది. దీంతో కంపెనీ ఆదాయం కూడా 27% పెరిగి రూ. 1,530 కోట్లకు చేరుకుంది.
US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచిన తర్వాత, ఆసియా మార్కెట్లు ఈరోజు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. అయితే భారత మార్కెట్లకు అధిక US వడ్డీ రేట్లు ప్రభావితం చేస్తాయి. USలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులు తక్కువ ఆకర్షణీయంగా మారుతాయి.
ఇవి కూడా చదవండి:
Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..
MahakumbhStampede: మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం కీలక నిర్ణయం..
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Read More Business News and Latest Telugu News