Share News

Gold and Silver Rates Today: షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 06:59 AM

అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.

Gold and Silver Rates Today: షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Rates

బిజినెస్ డెస్క్: బంగారం ధరలు పసిడి ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చాయి. రెండ్రోజులుగా స్వల్ప తేడాతో స్థిరంగా కొనసాగిన రేట్లు నేడు (25-02-2025) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో పసిడిని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్న మధుపరులు దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అతి త్వరలోనే బంగారం ధర రూ.90 వేలకు చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


కాగా, మంగళవారం నాడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. https://bullions.co.in/ ప్రకారం.. ఢిల్లీలో నిన్న (సోమవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,769 ఉండగా.. నేడు రూ.184 పెరిగి రూ.78,953కు చేరుకుంది. 24 క్యారెట్ల పసిడి ధర నిన్న రూ.85,930 కాగా.. నేడు రూ.200 పెరిగి రూ.86,130కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిన్న 22 క్యారెట్లు రూ.79,090 కాగా.. రూ.183 తగ్గి నేడు రూ.78,907కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్లు నిన్న రూ.86,080 కాగా.. నేడు రూ.200 పెరిగి రూ.86,280 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలోనూ ధరలు పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నిన్న 22 క్యారెట్ల ధర రూ.79,035 ఉండగా.. ఇవాళ రూ.183 పెరిగి రూ.79,218గా ఉంది. అలాగే 24 క్యారెట్ల ధర నిన్న రూ.86,220 కాగా.. నేడు రూ.200 పెరిగి రూ.86,420కు చేరింది.


వెండి ధరల పరిస్థితి ఇది..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95,290 ఉండగా.. ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ రూ.95,450గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.95,600 వద్ద కొనసాగుతోంది.


ప్రధాన నగరాల్లో బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఇవే..

  • ముంబై- రూ.79,090, రూ.86,280

  • పుణె- రూ.79,090, రూ.86,280

  • జైపూర్- రూ.79,081, రూ.86,270

  • పట్నా- రూ.79,044, రూ.86,230

  • చెన్నై- రూ.79,319, రూ.86,530

  • బెంగళూరు- రూ.79,154, రూ.86,350

  • కోల్‌కతా- రూ.78,989, రూ.86,170

  • భోపాల్- రూ.79,173, రూ.86,370

  • భువనేశ్వర్- రూ.79,108, రూ.86,300

  • తిరువనంతపురం-రూ.79,328, రూ.86,540


ఈ వార్తలు కూడా చదవండి:

ఐటీ పరిశ్రమకీ సుంకాల భయం

75,000 దిగువకు సెన్సెక్స్‌

Updated Date - Feb 25 , 2025 | 07:10 AM