Share News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..

ABN , Publish Date - Dec 31 , 2025 | 07:41 AM

ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాలు, ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..
Rangareddy Palli Accident

ప్రకాశం, డిసెంబర్ 31: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇంట్లో నుంచి బయటికి వచ్చినవాళ్లు క్షేమంగా ఇంటికి చేరుతామా లేదా అన్న టెన్షన్‌లో ఉన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే...


రాచర్ల మండలం రంగారెడ్డి‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసు కుంది. డీసీఎంలో మంటలు చెలరేగడంతో అందులోని డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వెర్రి స్వామిగా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తి కూడా అనంతపురం వాసి జయరామరెడ్డిగా గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ

వైసీపీ నేతల దర్శనాలపై సోషల్‌ దుమారం

For More AP News And Telugu News

Updated Date - Dec 31 , 2025 | 08:18 AM