Share News

తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్‌

ABN , Publish Date - Jan 14 , 2025 | 03:33 AM

‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ.

తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ. ఈ సందర్భంగా భారతీయులందరికీ, ముఖ్యం తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పండుగ కోసం నగరాలన్నీ పల్లెలవైపు పరుగులు తీశాయి. ప్రజలకు ఈ పండుగపై ఉన్న మక్కువను ఇది తెలియజేస్తుంది. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలి. తెలుగువారు ఎక్కడున్న ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’నని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 14 , 2025 | 03:34 AM