Home » AP deputy cm
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని కాళేశ్వర క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం రానున్నారు.
Pawan Kalyan tweet: ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది (సీజ్ఫైర్). ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇది క్షణాల్లో వైరల్గా మారింది.
Operation Sindoor: వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.
దేశం కోసం పోరాడడం అన్ని మతాల ఐక్యతను చాటుతుంది. ఉగ్రవాదాన్ని అరికట్టే పోరులో ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతు ప్రకటిస్తూ కష్టకాలంలో ఐక్యత అవసరం అన్నారు.
అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గాన్ని ఉద్బోధించారు. రాజధానిపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి, అభివృద్ధి దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు
తమిళ జాలర్లు బంగాళాఖాతంలో జరిగిన ఐదు ఘర్షణల్లో గాయపడ్డారని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత-శ్రీలంక సంబంధాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.
పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రజాసేవ, కళాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా బాలకృష్ణ విజయాన్ని ప్రశంసించారు.
గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికసిత్ భారత్కు కీలకమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ బలోపేతానికి 16వ ఆర్థిక సంఘం నిధుల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్, ఆయన కుమారుడు మార్క్ శంకర్పై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అల్లు అర్జున్ అభిమాని కాగా, మెగా ఫ్యామిలీపై ద్వేషంతో పోస్టులు చేసినట్లు వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందికి పదోన్నతుల కోసం చర్యలు ప్రారంభించారు. సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు