Minister Atchannaidu : పార్టీలో బాబు తర్వాత లోకేశే
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:37 AM
టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేశేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో పదవులపై కూటమి నిర్ణయం: మంత్రి అచ్చెన్నాయుడు
టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేశే: అచ్చెన్న
విశాఖపట్నం, జనవరి 23(ఆంధ్రజ్యోతి): టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేశేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ‘ఈ విషయం నేను కాదు, చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు’ అన్నారు. ప్రభుత్వంలో పదవులను కూటమి నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. గురువారం విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో లోకేశ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గత ప్రభుత్వం టీడీపీని భూస్థాపితం చేయాలని చూసిందని, అటువంటి సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ యువగళం పేరుతో రాష్ట్రమంతటా సుదీర్ఘ పాదయాత్ర చేశారని, 2024 ఎన్నికల్లో టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం వెనుక లోకేశ్ కృషి ఎంతో ఉందని అచ్చెన్న చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News