Share News

YS Sharmila Son : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల

ABN , Publish Date - Sep 08 , 2025 | 02:00 PM

అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల తేల్చేశారు. కర్నూల్‌లోని ఉల్లి మార్కెట్‌ను షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి సందర్శించారు. పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు.

YS Sharmila Son :  నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల
YS Sharmila Son Rajareddy

కర్నూలు, సెప్టెంబర్ 8 : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని తేల్చేశారు. కర్నూల్ ఉల్లి మార్కెట్ సందర్శించిన సందర్భంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. క్వింటా ఉల్లి రూ.600 ధర కూడా పలకడం లేదన్న షర్మిల.. గతం సంవత్సరం క్వింటా ఉల్లి రూ. 4500 ఉందని చెప్పారు. మార్క్ ఫెడ్ ద్వారా రూ. 1200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోందని.. అయితే రైతులు ఆరు వందలకే ఎందుకు అమ్ముకుంటున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. క్వింటా ఉల్లి రూ. 1200 లకు ఏ ఒక్క రైతు నుంచి కొనుగోలు చేయడం లేదని షర్మిల అన్నారు. ప్రభుత్వం క్వింటా ఉల్లి 2400 రూపాయలకు కొనుగోలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఇద్దరు ఉల్లి రైతులపై కేసులు పెట్టారని షర్మిల ఎద్దేవా చేశారు.

YS-Sharmila-son-1.jpg


ఇలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న షర్మిల, తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి సైతం రాజకీయ రంగంలోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా వైసీపీ పార్టీ మీద ఈ ప్రకటన ప్రభావం బాగానే చూపుతోంది. ఈ ఉదయం (2025 సెప్టెంబర్ 8)న కర్నూల్‌లోని ఉల్లి మార్కెట్‌ను షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి సందర్శించారు. పర్యటనకు ముందు రాజారెడ్డి తన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది రాజకీయ ప్రవేశానికి సంకేతంగా కనిపిస్తోంది. షర్మిల తన ప్రకటనలో, 'అవసరమైనప్పుడు నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు' అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్య రాజారెడ్డి రాజకీయ ఆరంగ్రేటానికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

YS-Sharmila-son-2.jpg


వైఎస్ రాజారెడ్డి.. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ పెద్ద కుమారుడు. 1996లో పుట్టిన రాజారెడ్డి హైదరాబాద్‌లోని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసి, యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రాజారెడ్డి గతంలో తన తల్లి షర్మిల రాజకీయ ప్రచారాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాలలో రాజారెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యం ఆయన రాజకీయ ఆసక్తిని కూడా సూచిస్తుంది. అంతేకాదు, షర్మిల ఆమె తనయుడ్ని రాజకీయంగా సిద్ధం చేస్తున్నారని కూడా తెలుస్తోంది. రాజారెడ్డి రాజకీయ ప్రవేశం వైఎస్ వారసత్వాన్ని మరో తరానికి విస్తరించేలా చేస్తోంది.

YS-Sharmila-son-3.jpg


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2025 | 02:09 PM