Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్..
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:12 AM
చిన్నటేకూరు బస్సును బైక్తో ఢీకొని మృతిచెందిన శివ శంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివ శంకర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కర్నూలు: చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఉలిందకొండ పీఎస్లో మరో కేసు నమోదు అయ్యింది. బైక్ను బస్సు ఢీకొని మృతిచెందిన శివ శంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివ శంకర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 281,125(A), 106(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అనంతరం ఎర్రిస్వామి మాట్లాడుతూ.. తాను, శివశంకర్ మద్యం సేవించినట్లు చెప్పాడు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో.. బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందన్నాడు. శివశంకర్ స్పాట్లో మృతి చెందగా.. తాను గాయపడి ప్రాణాలతో బయటపడినట్లు ఎర్రిస్వామి వివరించారు.
ఇవి కూడా చదవండి..
Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా
Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్